పందెంలో చనిపోయిన కోడికి రూ.లక్ష!
VSK NEWS ; పందెంలో పాల్గొనబోయే కోడికి రూ.లక్షలు వెచ్చించడం విన్నాం. ఇందుకు భిన్నంగా పందెంలో చనిపోయిన పుంజునూ రూ.లక్ష పెట్టి కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఏలూరు ఎన్ఆర్పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ పందెం పుంజును పెంచారు. ఆ కోడి గురువారం పందెంలో పోరాడి ఓడిపోయింది. పుంజు పోరాట పటిమ నలుగురికీ తెలియాలని దాన్ని శుక్రవారం వేలం వేశారు. ఆసక్తి ఉన్న పలువురు వేలంలో పాల్గొన్నారు. కోసి, కాల్చిన ఆ కోడిని ఏలూరు గ్రామీణ మండలం జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ.1,11,111కు దక్కించుకున్నారు.

Social Plugin